ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 03:23 PM

మంగళగిరి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని వందరోజుల్లో చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. మంగళగిరిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. స్వచ్ఛతలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను లాంఛనంగా ప్రారంభించామని చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్.చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఇవాళ(సోమవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేష్ మాట్లాడారు. చెత్తను తరలించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న రూ.1.91 కోట్ల విలువైన రెండు కాంపాక్టర్ వాహనాలు ఏపీలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa