ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని నిరుద్యోగులకు సూపర్ ఛాన్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 11:24 PM

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. అటవీ శాఖలో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 691 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అటవీ శాఖలోని 691 ఫారస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు ఈ పోస్టుల కోసం జూలై 16 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 5వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తివివరాల కోసం http://PSC.ap.gov.in సంప్రదించాలని అధికారులు సూచించారు. ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


నీట్ ర్యాంకర్లకు నారా లోకేష్ అభినందనలు


మరోవైపు నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. నీట్ ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంక్‌తో పాటుగా.. ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజమండ్రి విద్యార్థి డి.కార్తీక్ రామ్ కిరీటిని నారా లోకేష్ అభినందించారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి కార్తీక్ రామ్ కిరిటీ ఉండవల్లిలోని నివాసంలో.. మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా కార్తీక్ రామ్ కిరిటీని నారా లోకేష్ అభినందించారు. అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 113వ ర్యాంక్ సాధించిన పాలకొల్లు విద్యార్థి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్‌, 311వ ర్యాంక్ సాధించిన రాజమండ్రి విద్యార్థి కంచుమర్తి ప్రణీత్ కూడా నారా లోకేష్‌ను కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి నారా లోకేష్‌ను కలిశారు. వీరిని అభినందించిన నారా లోకేష్.. రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు.


మరోవైపు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలో 62 వేల ఇంజనీరింగ్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని అనుబంధ కాలేజీల్లో ఇంఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తనిఖీలు చేపట్టారు. మొత్తం 106 ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఈ విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌లో 62 వేల సీట్లు అందుబాటులో ఉండొచ్చని తెలిపారు. ఫార్మసీలో 3,950 సీట్లు.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి 16,068 సీట్లు అందుబాటులో ఉండొచ్చని వెల్లడించారు. ఈనెల 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు కోసం అవకాశం ఉందని.. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు, కాలేజిల్లో చేరేందుకు ఎంపిక చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa