ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 07:53 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిది.. మొదటి విడత కింద జూన్ 12న డబ్బుల్ని విడుదల చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.13వేల చొప్పున బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేశారు. ఇక తల్లికి వందనం పథకం రెండో విడతకు సంబంధించి అర్హుల జాబితా అందుబాటులోకి వచ్చింది. ఒకటో తరగతి, ఇంటర్ ఫిస్టియర్ విద్యార్థులతో పాటుగా మొదటి విడతలో అర్హత ఉన్నా సరే తల్లికి వందనం పథకం డబ్బులు జమ కానివారి దరఖాస్తుల్ని పరిశీలించి రెండో జాబితాను తయారు చేశారు. ఈ మేరకు రెండో విడత జాబితాకు సంబంధించి పేమెంట్ స్టేటస్ కోసం స్టూడెంట్ ఆధార్‌తో ట్రాక్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ ఎనేబుల్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ వెబ్ సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main ద్వారా చెక్ చేసుకోవచ్చు.


ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ (Track Application Status)లో తల్లి/తండ్రి/సంరక్షకులు (Mother/Father, Guardian) ఆప్షన్‌లో తల్లి ఆప్షన్ (Mother Option) సెలక్ట్ చేసుకుని.. తల్లి ఆధార్ ప్లేస్‌లో విద్యార్థి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. ఏ విద్యార్థికి డబ్బులు జమ అయ్యాయి, లేనిద ట్రాక్ అప్లికేషన్ నందు పేమెంట్ స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన విద్యార్థుల డేటా వివరాలు మాత్రమే డిస్‌ప్లే చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ వారి నుంచి వచ్చిన డేటాలో లేని విద్యార్థికి సంబంధించిన పేమెంట్స్ వివరాలు డిస్‌ప్లే చేయరు. వారికి సంబంధించి సాధారణ వివరాలు మాత్రమే కనిపిస్తాయి.


ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి డబ్బులు జమ చేస్తామని తెలిపింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తామని చెప్పింది. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ప్రకటించగా.. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం రూ.2వేలు మినహాయించుకుని ఒక్కో విద్యార్థికి రూ.13వేలు చొప్పున డబ్బుల్ని తల్లుల అకౌంట్‌లలో జమ చేశారు. అయితే కొందరు విద్యార్థులకు.. భూమి ఎక్కువగా ఉందని, నాలుగు చక్రాల వాహనం ఉందని, కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని, హౌస్‌ మ్యాపింగ్‌లో సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే ఇలా పలు సమస్యలతో తల్లికి వందనం పథకానికి అనర్హులయ్యారు. అయితే కొందరు విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించి రెండో జాబితాలో చేర్చారు. అయితే ఇప్పటికీ కొందరికి ఈ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించి తమకు కూడా తల్లికి వందనం పథకం డబ్బులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa