ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాల కారణంగా భర్తల హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 08:09 PM

తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాల కారణంగా భర్తల హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, నెల్లూరు జిల్లా రాపూరులో బాధాకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాపూరుకు చెందిన లేబాక శీనయ్య (28) భార్య చేతిలో బలయ్యాడు. అతడి భార్య ధనమ్మ, తన ప్రియుడు కల్యాణ్‌తో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, ధనమ్మకు కల్యాణ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధానికి శీనయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన ధనమ్మ, ప్రియుడు కల్యాణ్‌తో కలిసి శీనయ్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఒక పథకం పన్నారు. కరెంట్ వైరుతో శీనయ్య గొంతు బిగించి హతమార్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ధనమ్మ, కళ్యాణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.ప్రియుడితో కలిసి భార్యలు తమ భర్తలను దారుణంగా హతమార్చిన అనేక ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంఘటనలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని, సంబంధాల విచ్ఛిన్నతను స్పష్టం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa