రోజురోజుకూ దొంగలు మరీ బరితెగించి పోతున్నారు. ఒకప్పుడు అర్ధరాత్రి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడిన దొంగలు.. ఇప్పుడు రూటు మార్చారు. పట్టపగలే, దర్జాగా చోరీలు చేస్తున్నారు. అలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చింతల రాజ్యలక్ష్మి అనే మహిళ నందలూరు మహాత్మా జ్యోతిబా ఫులే సంక్షేమ గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. రోజూలాగే గురువారం విధులు ముగించుకొని రాజ్యలక్ష్మి ఇంటికి బయల్దేరారు. ఎప్పటిలాగే స్కూటర్ మీద రాజ్యలక్ష్మి మంటపంపల్లెలోని ఇంటికి వెళ్తుండగా అనుకోని ఘటన జరిగింది. రాజ్యలక్ష్మిని వెనుక నుంచి ఫాలో అవుతూ వచ్చిన ఓ దుండగుడు.. ఒక్కసారిగా బైక్ సాయంతో ఆమె స్కూటర్ను అడ్డగించాడు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి మెడలోని రెండు బంగారు నగలను లాగేసే ప్రయత్నం చేశారు.
ఒక్కసారిగా ఆగంతకుడు విరుచుకుపడటంతో రాజ్యలక్ష్మి షాక్ తిన్నారు. వెంటనే తేరుకుని అతన్ని ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే స్కూటర్ మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆమె ఒంటిపై ఉన్న రెండు బంగారు నగలను లాక్కున్న దుండగుడృు.. అక్కడి నుంచి పరారరయ్యాడు. రాజ్యలక్ష్మిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆగంతకుడికి కోసం దర్యాప్తు జరుపుతున్నారు.
మరోవైపు గొలుసు చోరీలకు పాల్పడుతున్న నవీన్ అనే వ్యక్తిని వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న మహిళలను దాహంగా ఉంది కాస్త మంచి నీళ్లు ఇవ్వాలని అడుగుతాడని.. మహిళలు నీళ్ల కోసం ఇంట్లోకి వెళ్లే సమయంలో వెనకాలే వెళ్లి మెడలోని బంగారు ఆభరణాలు, గొలుసులు లాక్కుని పారిపోతాడని పోలీసులు వివరించారు. ఈ రకంగా కడప జిల్లాలో ఆరు గొలుసు చోరీలకు పాల్పడినట్లు పెండ్లిమర్రి పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.10 లక్షలు విలువ గల 6 బంగారు చైన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే మనోడిపై గంజాయి అక్రమ రవాణా కేసులు కూడా ఉండటం గమనార్హం. జల్సాలకు అలవాటు పడి నవీన్ దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa