సరిహద్దుల్లో ఓవైపు పాకిస్థాన్.. మరోవైపు చైనాల నుంచి ముప్పు పెరుగుతోన్న నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటోంది. ఈ క్రమంలో సైన్యం కోసం అత్యాధునిక ఏకే-203 రైఫిల్స్ సిద్ధమవుతున్నాయి. వీటిని రష్యా సహాయంతో ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీలో తయారు చేస్తున్నారు. 2032 నాటికి ఇవ్వాల్సిన రైఫిల్స్ను 2030 నాటికే సైన్యానికి అందజేస్తామని ఇండో- రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటేడ్ (ఐఆర్ఆర్పీఎల్) తెలిపింది. నిమిషానికి 700 బుల్లెట్లను ఫైర్ చేయగలిగే ఈ రైఫిల్.. 800 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా కచ్చితంగా చేధించగలదు. సరిహద్దుల్లో దాయాది తరుచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ, ఈ రైఫిల్స్ భారత సైన్యానికి మరింత బలాన్నిస్తాయి.. ఇక, ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని అధునాత ఆయుధాలను సమకూర్చుకుంలోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యధిక పరిధి కలిగిన టోవ్డ్ ఆర్టిలరీ గన్ను అభివృద్ధి చేసింది. .
సరిహద్దుల్లోని పరిస్థితుల దృష్ట్యా భారతదేశం తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. కలాష్నికోవ్ సిరీస్లో కొత్తగా ఏకే-203 రైఫిల్స్ను సైన్యానికి అందిస్తున్నారు. చాలా శక్తివంతమైన ఈ రైఫిల్స్ను ‘షేర్’ పేరుతో అమేథీలోని ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేస్తోంది ‘మేము 2030 నాటికే 6.01 లక్షల ఏకే-203 రైఫిల్స్ను భద్రతా దళాలకు అందిస్తాం’అని IRRPL సీఈఓ మేజర్ జనరల్ ఎస్.కె.శర్మ అన్నారు. వాస్తవానికి ఈ రైఫిల్స్ను 2032 అక్టోబరు నాటికి ఇవ్వాల్సి ఉండగా.. కానీ అంతకంటే ముందే అందిస్తామని ఆయన చెప్పారు. ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు రూ.5,200 కోట్లు. అగ్ని-5 కొత్త వేరియంట్, 7500 కిలోల బంకర్ బస్టర్ వార్హెడ్లను భారత్ సమకూర్చుకుంటోంది.
ఇప్పటికే 48 వేల రైఫిల్స్ను అందజేశామని తెలిపారు. రెండు మూడు వారాల్లో మరో 7 వేల రైఫిల్స్, డిసెంబర్ నాటికి అదనంగా 15 వేల రైఫిల్స్ అందజేస్తామని ఆయన అన్నారు. ఏకే-47, ఏకే-57 కంటే ఈ 'షేర్' రైఫిల్స్ అత్యాధునికమైనవి. ఇవి కలాష్నికోవ్ సిరీస్లో చాలా ప్రమాదకరమైనవి కూడా. మన సైన్యం ప్రస్తుతం ఇన్సాస్ రైఫిల్స్ను వాడుతోంది. వాటి స్థానంలో ఈ ఏకే-203 రైఫిల్స్ను వాడనున్నారు. ఇన్సాస్ రైఫిల్ కాలిబర్ 5.62 ఎంఎం. కానీ ఏకే-203 రైఫిల్ కాలిబర్ 7.62 ఎంఎం.ఈ తుపాకీ బరువు 3.8 కేజీలు కాగా.. ఇన్సాస్ బరువు 4.15 కిలోలు. ఇన్సాస్ (960ఎంఎం)తో పోల్చితే పొడవు ( 705 ఎంఎం) కూడా తక్కువే. కాగా, రెండు రోజుల కిందట ఆకాశ్ ప్రైమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను లడఖ్లో పరీక్షించింది.
సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికులకు ఈ రైఫిల్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనివల్ల మన సైన్యం మరింత బలంగా తయారవుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. నియంత్రణ రేఖ , వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ కాసే సైనికులకు ఇవి చాలా అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa