ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో 20, బెంగళూరులో 40 పాఠశాలకు బాంబు బెదిరింపులు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 08:10 PM

దేశంలోని రెండు ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరులోని 60కి పైగా పాఠశాలలకు శుక్రవారం రోజు ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్స్ ద్వారా ఈ బెదిరింపులు రావడంతో.. ఉపాధ్యాయులు, విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులంతా భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మెయిల్స్ వచ్చిన వెంటనే పాఠశాలల యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఇలా పోలీసులు రంగంలోకి దిగి అన్ని బడుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్లను కూడా వెంట తీసుకెళ్లి మరీ పాఠశాలల్లో ఏమైనా బాంబులు ఉన్నాయేమోనని వెతికారు. ఈక్రమంలోనే ఇవన్నీ బూటకపు బెదిరింపులు అని తేలాయి.


బెంగళూరులోని 40 ప్రైవేట్ పాఠశాలలకు, ఢిల్లీలోని 20 పాఠశాలలకు ఈ బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. అందులో "పాఠశాల లోపల బాంబులు" అనే సబ్జెక్ట్ లైన్ రాసి ఉండగా.. "రోడ్‌కిల్333@atomicmail.io" అనే ఈమెయిల్ ఐడి నుంచి పంపినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు పోలీసులకు కూడా ఇదే రకమైన మెయిల్ వచ్చింది. ముఖ్యంగా అందులో.. హలో, నేను పలు స్కూళ్లలో బాంబులు పెట్టానని ఉంది. అలాగే వాటిని బయటకు కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నా అని కూడా చెప్పారు. ఒక్కర్ని కూడా వదలనంటూనే.. అందరినీ హతమారుస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా టీవీలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటానని చెప్పారు. ఆ తర్వాత నా చేయి, గొంతు కోసుకుని మరీ ఆత్మహత్య చేసుకుంటానంటూ పేర్కొన్నాడు.


ఇది చూసిన పోలీసులు వెంటనే అగ్నిమాపక దళం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను తీసుకుని మరీ బడుల్లో తనిఖీలు చేశారు. కొన్ని గంటల పాటు విస్తృతంగా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా చాలా పాఠశాలలు విద్యార్థులను త్వరగా ఇళ్లకు పంపించాయి. ఢిల్లీ పోలీసులు, సైబర్ యూనిట్లతో కలిసి దర్యాప్తును ప్రారంభించారు. మొదటగా రోహిణి సెక్టార్-3లోని అభినవ్ పబ్లిక్ స్కూల్ వీటిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత పశ్చిమ్ విహార్‌లోని రిచ్‌మండ్ గ్లోబల్ స్కూల్‌కు బెదిరింపులు అందాయి. దీనికి గత మూడు రోజుల్లోనే రెండు సార్లు ఇలాంటి హెచ్చరికలు వచ్చాయి.


అలాగే బెంగళూలోని రాజేశ్వరీ నగర్, కెంగరీ ప్రాంతాల్లోని అనేక బడులకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఇప్పటి వరకు బృందాలు గాలింపు చేస్తూనే ఉండగా.. ఒక్క చోట కూడా పేలుడు పదార్థాలు లభించలేదు. అలాగే ఢిల్లీతో పాటు బెంగళూరులోని బడులకు వచ్చిన మెయిల్స్ అన్నీ ఒకే ఐడీతో వచ్చాయని.. అవన్నీ బూటకపువిగా అధికారులు గుర్తించారు. ఇలా తరచుగా బాంబు బెదిరింపులు రావడంపై దేశ ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వివరిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa