ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్‌ను అయినా సాధించారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 11:08 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అన్యాయానికి రాయలసీమ పేరు ఎత్తే అర్హత కూడా ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడం కోసం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కనీసం ఒక్క ప్రాజెక్ట్‌ను అయినా సాధించారా అని ప్రశ్నించారు. నేడు రాయలసీమను రతనాల సీమ చేస్తానంటూ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసేందుకు సిద్దమయ్యారని ధ్వజమెత్తారు. 1998 లో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను కేవలం తాగునీటికే వాడుకోవాలంటూ చంద్రబాబు జీఓ ఇచ్చిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa