ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ అధికారులని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 12:45 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని.. లేకపోతే తాము తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఏపీలో తాము మళ్లీ అధికారంలోకి వస్తాం.. అధికారుల అంతం చూస్తామంటూ జగన్ అజ్ఞానరహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారులను జగన్ ఏమీ చేయలేరని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు జైలుకి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(శనివారం) రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. జగన్ పరిపాలనలోని వైఫల్యాలనే తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు జైలుకి వెళ్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ పరిపాలనలో లోపాలు మీకు అర్థం కావటం లేదా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో వైసీపీ నేతలు ఏం చేయించారో..ఒకసారి రికార్డులు వెనక్కి తీయిస్తే వారు చేసిన అరాచకాలు బయటపడుతాయని చెప్పుకొచ్చారు. జగన్ ప్రతిపక్ష నేతగా కూటమి ప్రభుత్వాన్ని బెదిరిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మరుని.. మళ్లీ మీరు అధికారంలోకి రాలేరని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa