చోడవరం, అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గంలో 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఎమ్మెల్సీ చిరంజీవిరావు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, "ప్రజల కోసం పనిచేయాలనే ధ్యేయంతో ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. 'సుపరిపాలన తొలి అడుగు' వంటి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించడానికి మార్గం వేస్తున్నాయి" అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలు వినిపించి వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa