ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్ప కూలిన రష్యా సైనికులు,,,విషం కలిసిన నీరు తాగడం వల్లే అని అనుమానం

international |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 07:28 PM

యుద్ధంలో ప్రత్యర్థిని దెబ్బ తీయడానికి ఎలాంటి మార్గాన్ని అనుసరించినా తప్పు లేదని చెబుతుంటారు. అందుకే చాలావరకు యుద్ధాల్లో వెన్నుపోటు, నమ్మకద్రోహం ప్రధానంగా కనిపిస్తుంటాయి. కాలం ఏదైనా యుద్దాల్లో మాత్రం ఇలాంటి సీన్లు కచ్చితంగా కనిపిప్తాయి. ఇక సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రేయిన్ యుద్ధంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయుధాలతో కాకుండా.. అత్యవసర సామాగ్రిని వాడి ప్రత్యర్థిని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.


తాజాగా నలుగురు రష్యా సైనికులు తమ సహచరుల కళ్ల ఎదురుగానే కుప్పకూలి ప్రాణాలు విడవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో అనేక కొత్త అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. రష్యా సైనికులు తాగే నీళ్ల బాటిళ్లలో విషయం కలిపారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాలు..


ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యన్‌ సైనికులకు కొత్త భయం పట్టుకుంది. ఇటీవల ఫ్రంట్‌ లైన్‌లో ఉన్న నలుగురు రష్యా సైనికులు.. వారి తోటి సిబ్బంది కళ్లముందే కుప్పకూలి.. మృత్యువాతపడ్డారు. వారి చనిపోవడానికి కారణం విషం కలిసిన నీళ్లు అని అంటున్నారు. ఆ నలుగురు సైనికులు తాగిన నీటిలో విషం కలిసిందని.. అదే వారి ప్రాణాలు తీసిందని చెబుతున్నారు. అలానే మరి కొందరి సిబ్బంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత దొనెట్స్క్‌ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది.


అయితే రష్యా సైనికులు తాగిన ఈ అవర్ వాటర్ నీళ్ల బాటిల్స్.. మానవతా సాయం కింద ఈ ప్రాంతానికి వచ్చాయని.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.ఈ వాటర్ బాటిల్స్‌ని క్రిమియాలోని సిమఫెరోపోల్‌ నుంచి పంపించినట్లు గుర్తించారు. అయితే ఈ బాటిళ్లను ఎవరు పంపారు.. అవి ఫ్రంట్‌లైన్‌ సైనికులు చేతికి ఎలా వచ్చాయి.. నిజంగానే ఆ వాటర్ బాటిల్స్‌లో విషం కలిపారా.. అదే వాస్తవం అయితే ఎవరూ అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు క్రెమ్లిన్‌ వర్గాలు వెల్లడించాయి.


అయితే వాటర్ బాటిల్స్‌లో విషం కలిపి రష్యా సైనికులకు పంపిణీ చేసిన కుట్రలో ఉక్రెయిన్‌ హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా సైన్యం, సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటుగా సరకుల రవాణాకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతోనే.. ఉక్రెయిన్.. ఇలాంటి నీచపు పనులకు పాల్పడిందని రష్యన్‌ మిలిటరీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. రష్యా సైనికుల డ్రగ్స్‌ తీసుకుని.. అవి వికటించే మృతి చెందారని.. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకే మాస్కో ఈ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడింది.


ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల మరింత తీవ్ర అయ్యాయి. తాజాగా శుక్రవారం నాడు రష్యా 500 కేజీల భారీ గ్లైడ్‌ బాంబును ప్రయోగించింది. ఈ ఘటనలో ఇద్దరు సామాన్యులు మరణించగా.. 25 మంది గాయపడ్డారని.. 50 దుకాణాలు, 13 నివాస భవనాలు ధ్వంసమయ్యాయని తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa