యువరాజ్ సింగ్ , క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వీరంతా మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. అదేంటి వీరంతా ఎప్పుడో క్రికెట్కు గుడ్బై చెప్పేశారుగా అని అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నది కరెక్టే.. మేం చెప్పేది కూడా నిజమే. ఎందుకంటే వారంతా ఇప్పుడు రిటైర్మెంట్ పలికిన ఆటగాళ్లు ఆడే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025లో పాల్గొంటున్నారు. శుక్రవారమే ఈ టోర్నీకి తెరలేచింది. ఆగస్టు 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం..
ఈ టోర్నీలో మొత్తంగా ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్తో పాటు వెస్టిండీస్కు చెందిన లెజెండ్స్ టీమ్స్ పాల్గొంటున్నాయి. టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్లో మ్యాచ్లు జరగనున్నాయి. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో సెమీ ఫైనల్స్, పైనల్తో కలిపి మొత్తంగా 18 మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ దశలో అన్ని జట్లు ఒకదానితో ఒకటి ఒక్కో మ్యాచ్ ఆడతాయి. పాయింట్స్ టేబుల్లో టాప్-4లో నిలిచిన జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. జులై 31న సెమీఫైనల్.. ఆగస్టు 2న ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. యువరాజ్ సింగ్ కెప్టెన్గా ఉంటాడు.
ఇండియా ఛాంపియన్స్ టీమ్:
యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, పీయుష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్ధార్థ్ కౌల్, గుర్కీరత్ మాన్.
ఈ టోర్నీ మొత్తం ఇంగ్లాండ్లోని నాలుగు వేదికల్లో జరగనుంది. అవి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్, లీడ్స్లోని హెడింగ్లీ, నార్తాంప్టన్లోని కౌంటీ గ్రౌండ్, లీసెస్టర్లోని గ్రేస్ రోడ్ మైదానాలు. ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్స్లో ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. అంతేకాకుండా ఫ్యాన్కోడ్ యాప్, వెబ్సైట్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఇందులో భారత్ తన తొలి మ్యాచ్లో జులై 20న పాకిస్థాన్ ఛాంపియన్స్తో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa