ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా దేవ్రీ మందిరాన్ని సందర్శించిన ఎంఎస్ ధోనీ

sports |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 11:21 PM

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాంచీలోని మా దేవ్రీ మందిరాన్ని సందర్శించారు. శనివారం కావడంతో అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ధోనీ కొబ్బరి కాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నాడు. ధోనీతో పాటు ఆయన భార్య సాక్షి, కూతురు జీవా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ధోనీ రాకతో స్థానికి పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.


బైక్ రైడింగ్స్, వ్యవసాయం చేయడంతో పాటు ఫ్యామిలీతో కలిసి అప్పుడప్పుడు ఇలా ఆధ్యాత్మిక చింతనలోనూ మునిగిపోతుంటాడు. రాంచీలోని గ్రామ దేవత మా దేవ్రీ ఆలయాన్ని ప్రత్యేకంగా సందర్శించిన ధోనీ.. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత కొబ్బరి కాయ కొట్టాడు. అనంతరం భార్య, పాపతో కలిసి నమస్కారం చేసుకున్నాడు.


రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టచ్‌లో ఉంటున్నాడు. తన పుట్టిన రోజును కూడా సన్నిహితుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీమిండియా యువ ఆటగాళ్లతో కలిసి పార్టీల్లో డాన్స్‌లు కూడా వేశాడు. మొన్నామధ్య రిషబ్ పంత్ చెల్లి పెళ్లిలో అందరితో కలిసి నాలుగు స్టెప్పులు కూడా వేశాడు. ఆ మధ్య హార్దిక్, ఇషాన్‌తో కలిసి దుబాయ్‌ పార్టీలో కూడా కనిపించాడు.


ఐపీఎల్ 2025 తర్వాత ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ అవుతాడని అందరూ అనుకున్నప్పటికీ.. ఇప్పుడల్లా రిటైర్డ్ అవ్వనని మిస్టర్ కూల్ చెప్పేశాడు. ధోనీ చివరి మ్యాచ్ మాత్రం చెన్నైలోనే జరగనుంది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 196 పరుగులు చేశాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ.. 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa