ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు కూటమి ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని వైయస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. మిధున్రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆదివారం గుంతకల్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు వై. వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ యాదవ్ మాట్లాడుతూ..వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ కావాలనే కక్ష సాధింపు ధోరణితో నిన్నటి రోజున అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా కేవలం ప్రశ్నిస్తున్నారనేటువంటి నేపముతో వైయస్ఆర్సీపీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్రమ అరెస్టులు చేస్తూ దాడులు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నారా లోకేష్ ప్రవేశపెట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అన్నారు. వైయస్ జగన్ పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఇలా కక్ష సాధింపు దూరంలో చేయలేదన్నారు. కూటమి నాయకులు అధికారులను అడ్డం పెట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తూ వైయస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ కావాలనే వారిపైన అక్రమ అరెస్టులు చేయటం నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa