అభివృద్ధి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పచ్చని పంట పొలాలను ధ్వంసం చేయాలనుకోవడంపై పునఃపరిశీలన చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరేడు భూముల వివాదం నేపథ్యంలో ‘అభివృద్ధి పేరుతో భూదోపిడీ’ అనే అంశంపై ఆదివారం గుంటూరు జనచైతన్య వేదిక హాలు లో చర్చాగోష్ఠి జరిగింది. శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. 5,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీసిటీలో 300లకు పైగా 30దేశాల కంపెనీలు కొనసాగుతుంటే.. 8,500 ఎకరాల పంట పొలాలను ఇండోసోల్ అనే ఒక్క కంపెనీకి ధారాదత్తం చెయ్యాలనుకునే కుటిల ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. వేలాది మంది కరేడు రైతుల పోరాటాన్ని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.42 వేల కోట్ల కేటాయిస్తే, ఇండోసోల్ కంపెనీకి రూ.46,429 కోట్ల ప్రజాధనాన్ని ప్రోత్సహకాలు, సబ్సిడీల రూపంలో ఇవ్వాలనుకోవడం ప్రజావ్యతిరేక చర్య అన్నారు. రైతుల నుంచి భూసేకరణ వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతుం దని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa