ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండెపోటుతో టీడీపీ కార్యకర్త మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 08:52 AM

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేట్‌ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు(50) ఆదివారం ఉదయం ఇంటి వద్ద గుండెపోటుతో మృతిచెందారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్‌ రోజున అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేయగా.. ఆయన్ను నంబూరి శేషగిరిరావు ఎదిరించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. శేషగిరిరావు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణం విషయం తెలియగానే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వచ్చారు. మృతదేహానికి నివాళులర్పించారు. శేషగిరిరావుకి ఆదివారం సాయంత్రం గ్రామస్థులు, టీడీపీ నాయకులు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే, టీడీపీ యువ నాయకుడు నిఖిల్‌ అక్కడే ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa