దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకాలోని బసవపట్న పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య కేసులో ఓ మహిళ, ఆమె ప్రియుడితో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బీబీ ఆయేషా అనే మహిళ తన భర్త ఇల్యాజ్ అహ్మద్ను ప్రియుడు మంజునాథ్తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 2023 ఫిబ్రవరి 26న భద్రా కాలువ వద్ద ఇల్యాజ్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. ఆయేషా, మంజునాథ్తో ఉన్న అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనలో మంజునాథ్, ఇల్యాజ్ను బసవపట్న సమీపంలోని ఓ ధాబాకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ తర్వాత ఇల్యాజ్ను కాలువలో ఈతకు దిగమని ప్రేరేపించి, అతను సహాయం కోసం కేకలు వేస్తున్నప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు, దీంతో ఇల్యాజ్ మునిగి మరణించాడు. ఆయేషా మొదట తన భర్త ఫిబ్రవరి 23, 2023 నుంచి కనిపించకుండా పోయాడని బసవపట్న పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. అయితే, కాలువలో లభ్యమైన మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇల్యాజ్గా గుర్తించారు.
విచారణలో భాగంగా ఆయేషాను ప్రశ్నించిన పోలీసులకు ఆమె మంజునాథ్తో ఉన్న సంబంధాన్ని అంగీకరించింది. ఈ హత్య కేసులో ఇద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్ ఈ కేసును విజయవంతంగా చేధించిన విచారణ బృందాన్ని ప్రశంసించారు. నిందితులిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa