ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగాలు వస్తాయన్న ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 06:21 AM

విశాఖపట్నంకు టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజం వస్తే మరెన్నో కంపెనీలు వస్తాయన్న లాజిక్‌ను విస్మరించి వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ నగరం అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగాలు రావడం ప్రతిపక్షానికి ఇష్టం లేదని విమర్శించారు. టీసీఎస్ ఎక్కడికో వెళుతుంటే తాము భూములిచ్చి విశాఖలో నెలకొల్పేలా చేశామని వెల్లడించారు.టీసీఎస్‌కు తక్కువ ధరకు భూములిచ్చారనే దానికంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది చూడాలని హితవు పలికారు. వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోకుంటే ఈసారి డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు. అలాగే, ప్రతి ఒక్కరు టీసీఎస్ వలే పెద్ద క్యాంపస్ కట్టలేని కంపెనీలు ఉంటాయని, అలాంటి వారి కోసం 'సత్వా' డెవలపర్స్ ప్రాజెక్టు చేపడుతుందని ఆయన అన్నారు.ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు 25 ఎకరాల్లో పదిహేను, ఇరవై టవర్లు కడితే చిన్న చిన్న కంపెనీలు వస్తాయని అన్నారు. హైదరాబాద్‌లో రహేజా మైండ్ స్పేస్‌లో ఎన్నో కంపెనీలు వచ్చాయని, రేపు సత్వాలోనూ అలాగే వస్తాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa