ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ (81) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. శిబూ సోరెన్ మూడు సార్లు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా, 8 సార్లు లోక్సభ ఎంపీగా పని చేశారు. ఆయన కొడుకు హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఝార్ఖండ్ సీఎంగా ఉన్నారు.జార్ఖండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను స్థాపించారు. ఆయన కృషి ఫలితంగానే 2000వ సంవత్సరంలో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అనేక దశాబ్దాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా, మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి సేవలు అందించారు. జార్ఖండ్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఆయన మరణం ఆ రాష్ట్రానికి తీరని లోటుగా మారింది. ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ఆయన కుమారుడే కావడం విశేషం. శిబు సోరెన్ మరణ వార్త తెలిసిన వెంటనే హేమంత్ సోరెన్ ఢిల్లీకి చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa