పెంపుడు కుక్క చేసిన చిన్న పనికి యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. విజయనగరం జిల్లా రాజాంలోని గాయత్రీ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క ఇటీవల కాలంలో పక్కనే ఉండే ఇంటికి వెళ్లి మలవిసర్జన చేస్తోంది. ఆ ఇంటి యజమాని కుక్క యజమానిని ఒకటి, రెండుసార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మళ్లీ ఆదివారం రాత్రి కూడా కుక్క అదే మాదిరిగా చేయడంతో ఆ ఇంటి యజమాని కుక్క యజమానిని నిలదీశారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ వరకు వెళ్లింది. ఆ తర్వాత స్థానికులు గొడవ వద్దని చెప్పి ఇద్దర్ని అక్కడి నుంచి పంపించారు.
ఈ క్రమంలో కుక్క యజమాని దీనిని అవమానంగా భావించారు.. పాపం మనస్తాపంతో క్షణికావేశంలో బ్లేడుతో తన గొంతు కోసుకున్నారు. అయితే వెంటనే కుటుంబ సభ్యులు గమనించారు.. స్థానికుల్ని పిలిచి వెంటనే 108తో పాటుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో పోలీసులు జీపు అక్కడికి చేరుకోవడంతో.. అందులో అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ డాక్టర్లు వైద్యం అందించగా.. ప్రాణాపాయం లేదని చెప్పారు.. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదన్నారు పోలీసులు. అయితే బ్లేడుతో గొంతు కోసుకున్న కుక్క యజమాని మానసికపరమైన చిన్న సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. పాపం పెంపుడు కుక్క విషయంలో మొదలైన చిన్న గొడవ ఒకరి కారణం కావడం చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa