ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. రూ.17 వేల కోట్ల బ్యాంకు రుణాల మళ్లింపు, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. "తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించార నిధులు ఏవైనా రాజకీయ పార్టీలకు చేరాయా "అధికారులకు లంచాలు ఇచ్చారా" వంటి కీలక ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించినట్టు సమాచారం.గత దశాబ్ద కాలంగా అనిల్ అంబానీ తన గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలను వాటి అసలు ప్రయోజనాలకు కాకుండా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది. ఈ కేసులో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి పలు కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా 2017 నుంచి 2019 మధ్య యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న సుమారు రూ. 3,000 కోట్ల రుణాల మళ్లింపు ఒక అంశం కాగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సంబంధించిన రూ. 14,000 కోట్లకు పైగా భారీ మోసం మరో కీలక అంశంగా ఉంది.ఈ కేసు దర్యాప్తులో భాగంగా గత వారం ఈడీ అధికారులు ముంబై, ఢిల్లీలోని అనిల్ అంబానీకి సంబంధించిన పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున పత్రాలు, హార్డ్ డ్రైవ్లు, ఇతర డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. యెస్ బ్యాంక్ రుణ మోసం కేసులో మనీలాండరింగ్ కోణంలో మొదలైన ఈ దర్యాప్తు, ఇప్పుడు మరింత విస్తృతంగా మారింది.బ్యాంకు నిధులను డొల్ల కంపెనీల ద్వారా మళ్లించి, రిలయన్స్ గ్రూప్ సంస్థలు దుర్వినియోగం చేశాయా అనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇదే సమయంలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా అనిల్ అంబానీ గ్రూపులోని ఇతర కంపెనీలపై తనదైన శైలిలో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా, అనిల్ అంబానీ విచారణను అధికారులు కెమెరాల్లో రికార్డ్ చేస్తున్నారని, విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించలేదని నివేదికలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa