ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతన్న భరోసా పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 02:26 PM

AP: చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత కార్యక్రమంలో మాట్లాడుతూ.. చేనేత కుటుంబాల కోసం నేతన్న భరోసా పథకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో చేనేతలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. అలాగే ఆగస్టు నుంచే ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్‌, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa