పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ సమయంలోనే ఐదు యుద్ధ విమానాలను పేల్చేశామంటూ.. భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శనివారం రోజు ప్రకటన చేశారు. అయితే తాజాగా ఈయనపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వాటిని తీవ్రంగా ఖండించారు. భారత్ ఐదు విమానాలను కాదు.. ఒక్క విమానాన్ని కూడా కూల్చివేయలేదని, ఈ వాదనలన్నీ నిరాధారమైనవని స్పష్టం చేశారు.
ఐదు కాదు ఒక్కటి కూడా పేల్చలేదు..!
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత వైమానిక దళం చేస్తున్న ఈ వాదనలు నమ్మశక్యం కానివిగా ఉన్నాయని అన్నారు. ఇరు దేశాలు నిజంగానే తమ వాదనలపై నిలబడాలనుకుంటే.. తమ విమానాల జాబితాలను స్వతంత్ర పరిశీలన కోసం అందుబాటులో ఉంచాలని ఆయన సవాలు చేశారు. ఈ వాస్తవాన్ని నిర్ధారించుకోవడానికి అంతర్జాతీయ సంస్థలు, నిపుణులను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఈ సవాలు ద్వారా తమ వైపు నుంచి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థం అవుతోంది.
ఈ వివాదంపై భారత రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేగింది. భారత వైమానిక దళ అధిపతి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మే 10వ తేదీన ఆపరేషన్ సిందూర్ను ఎందుకు నిలిపివేశారని, మోదీపై ఎవరి ఒత్తిడి వచ్చింది, దేశ ప్రయోజనాల కోసం ఆయన ఎందుకు లొంగిపోయారని ఆయన నిలదీశారు. వాయుసేన చీఫ్ చేసిన ప్రకటనల తర్వాత ఈ ప్రశ్నలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఇలాంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఆపరేషన్ సిందూర్లో భారతీయ వాయుసేన పాకిస్థాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని నేల కూల్చిందని ఎయిర్ చీఫ్ మార్షన్ అమర్ ప్రీత్ సింగ్ శనివారం ప్రకటించారు. ఇది గగనతల యుద్ధంలో భారత్ ఇప్పటి వరుకూ సాధించిన అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు. అయితే మూడు నెలల తర్వాత దీనిపై భారత్ క్లారిటీ ఇవ్వగా.. పాకిస్థాన్ ఖండించింది. ఇంత ఆలస్యంగా చేస్తున్న ఈ వ్యాఖ్యలన్నీ తప్పుడువేనని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa