మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? హైరిటర్న్స్ కోసం కొత్త ఫండ్ పథకాల కోసం వేచి చూస్తున్నారా? అయితే ఈ వారం మూడు కొత్త పథకాలు లాంచ్ అవుతున్నాయి. ఈ వారం మూడు పాసివ్ మ్యూచువల్ ఫండ్స్ సబ్స్క్రిప్షన్ ఓపెన్ అవుతున్నాయి. కొత్త పథకాల ద్వారా తమ పోర్ట్ఫోలియోను వైవిధ్యభరితం చేయాలని ఏఎంసీలు భావిస్తున్నాయి. ఈ మూడు ఫండ్లలో ఒకటి కమోడిటి, ఒక ఈక్విటీ, మరోకటి హైబ్రిడ్ ఆధారిత ఫండ్స్ ఉన్నాయి. ఎడెల్వేయిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక స్కీమ్ లాంచ్ అవుతుండగా మీరే అసెట్ మ్యూచువల్ ఫండ్ నుంచి రెండు పథకాలు వస్తున్నాయి.
ఎడెల్వేయిస్ మల్టీ అసెట్ ఓమ్ని ఫండ్
ఎడెల్వేయిస్ మల్టీ అసెట్ ఓమ్నీ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్ స్క్రిప్షన్ ఆగస్టు 12, 2025 తేదీన మొదలవుతోంది. ఆగస్టు 26, 2025 తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 100గా నిర్ణయించారు.
మీరే అసెట్ గోల్డ్ సిల్వర్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ తో పాటు మీరే అసెట్ మల్టీ ఫ్యాక్టర్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 11, 2025 తేదీన మొదలవుతోంది. యూనిట్ల కొనుగోలు కోసం ఆగస్టు 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు పథకాల్లో కనీస పెట్టుబడి రూ. 5000 గా నిర్ణయించారు.
మ్యూచువల్ ఫండ్స్లోనూ హైరిస్క్ ఉంటుంది. ఈక్విటీ ఆధారిత ఫండ్లు మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. ఇన్వెస్టర్ తన రిస్క్ సామర్థ్యం, పెట్టుబడి లక్ష్యం, భవిష్యత్తు అవసరాల వంటి వివిధ అంశాల ఆధారంగా పోర్ట్ ఫోలియో నిర్మించుకోవాలి. ఎంచుకునే స్కీమ్ తమ లక్ష్యాలను చేరుకోగలదా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సరైన ఫండ్ ఎంచుకుని దీర్ఘకాలం పాటు కొనసాగినప్పుడే హైరిటర్న్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa