ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ZPTC ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు: పేర్ని నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 07:03 PM

 పులివెందుల ZPTC ఉప ఎన్నిక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు ప్రలోభాలు, దౌర్జన్యాలు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఈ మేరకు ఓటుకు రూ.10 వేలు ఇస్తామని ఓటర్లను ప్రలోభపెడుతున్నారని అన్నారు. ఆ పార్టీ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై EC చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa