ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో జలపాతం వద్ద చిక్కుకున్న 36 మంది పర్యాటకులను రెస్క్యూ టీమ్ రక్షించింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 11:38 PM

అనకాపల్లి జిల్లాలోని సరియా జలపాతం వద్దకి వెళ్లిన 36 మంది పర్యాటకులు వరద జలాల్లో చిక్కిపోయారు. వారికి పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సమయానికి చేరుకుని సురక్షితంగా కాపాడారు.విశాఖ నుండి వచ్చిన 36 మంది పర్యాటకులు మంగళవారం ఉదయాన్లో సరియా జలపాతాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలో భారీ వర్షం పడడంతో సరియా నది అడ్డంగానే చిక్కుకుపోయారు. ఈ ఘటన తెలిసిన వెంటనే కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహాన్ సిన్హా వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు, మరియు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎస్పీ తుహాన్ సిన్హా, దేవరాపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ అగ్నిమాపక సిబ్బందితో సహా ఆ ప్రాంతానికి వెళ్లి పర్యాటకులను సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. అనంతరం దేవరాపల్లి వద్ద అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, కె.కోటపాడు సీఐ పైడపునాయుడు పర్యాటకులకు పునరావాస ఏర్పాట్లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa