ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాస్కోలో జైశంకర్, లావ్రోవ్ భేటీకి రంగం సిద్ధం

national |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 08:50 PM

భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు, పర్యటనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మధ్య మరో కీలక భేటీ జరగనుంది.ఈ నెల ఆగస్టు 21న మాస్కోలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం అధికారికంగా ధృవీకరించింది. ద్వైపాక్షిక ఎజెండాలోని ముఖ్యమైన అంశాలతో పాటు, అంతర్జాతీయ వేదికలపై సహకారం గురించి ఇరువురు నేతలు చర్చిస్తారని ఒక ప్రకటనలో తెలిపింది.ఇటీవల భారత జాతీయ భద్రతా సలహాదారు  అజిత్ దోవల్ మాస్కోలో పర్యటించిన కొద్ది రోజులకే ఈ సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలో దోవల్ర ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారుగత కొంతకాలంగా జైశంకర్, లావ్రోవ్ పలు వేదికలపై సమావేశమవుతూనే ఉన్నారు. గత నెలలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా, జూలై 15న జరిగిన షాంఘై సహకార సంస్థ  విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా కూడా వీరిద్దరూ చర్చలు జరిపారు. పశ్చిమాసియా, బ్రిక్స్, ఎస్‌సీఓ వంటి అంశాలతో పాటు ద్వైపాక్షిక సహకారంపై మంతనాలు జరిపారు.ఈ ఏడాది మార్చి 7న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సైతం మాస్కోలో పర్యటించి రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని సమీక్షించారు.ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఇరు దేశాల నేతల మధ్య వార్షిక సమావేశాల సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ఈ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa