ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మం నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతమని వ్యాఖ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 16, 2025, 07:11 PM

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమని ఆయన పేర్కొన్నారు. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం అని చెప్పారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనమని అన్నారు. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa