రాష్ట్రంలోని మహిళలకు కానుకగా కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.తాజాగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని తన పోస్టులో పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదని, అది వారి స్వేచ్ఛకు, గౌరవానికి, ప్రభుత్వంపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు."ఈ ఉచిత బస్సు టికెట్ మహిళల సాధికారతకు ప్రతీక. ఇది కేవలం ప్రయాణం కాదు, సమాన అవకాశాల దిశగా వేస్తున్న ఒక ముందడుగు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళా సాధికారతకు మా ప్రభుత్వం పట్టం కట్టింది" అని లోకేశ్ తెలిపారు. ఈ చారిత్రక సందర్భాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలని ఆయన రాష్ట్రంలోని మహిళలకు పిలుపునిచ్చారు. ప్రయాణ సమయంలో తమ ఉచిత బస్సు టికెట్తో సెల్ఫీ దిగి, మహిళా సాధికారత అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని ఆయన కోరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa