దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారనుంది.
విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముంది. వాతావరణ కేంద్ర డైరెక్టర్ భారతి సవ్వడి వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది ఆగస్టు 19న దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. విపత్కర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది:
*రెడ్ అలర్ట్: విశాఖపట్నం,అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ,పశ్చిమ గోదావరి
*ఆరెంజ్ హెచ్చరిక:శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు,ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు,ప్రకాశం, నంద్యాల
*ఎల్లో అలర్ట్:కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి,చిత్తూరు
వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని వాతావరణ శాఖ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa