నగర జీవితం సౌకర్యాల పేరుతో సాగుతున్నా, సామాన్యుల జీవితం మాత్రం బరువుతోనే సాగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం గ్రామాల నుంచి నగరాల బాట పడే వారి కోసం ఇక్కడి జీవన వ్యయం ఒక భారమే. ఒక రెంటు గది, రోజువారీ ఖర్చులు, మరియు ప్రయాణాల ఖర్చులు — ఇవన్నీ కలిసి వారి జేబులకు చిల్లు పెట్టే పరిస్థితిని తలపెడుతున్నాయి.
ప్రయాణాల విషయానికి వస్తే, ట్రాఫిక్ భయంతో చాలా మంది సొంత వాహనాలను పక్కన పెట్టి మెట్రో రైలు వైపు మొగ్గు చూపుతున్నారు. వేగంగా, ట్రాఫిక్ లేకుండా గమ్యానికి చేరుకునే అవకాశం ఉండటంతో మెట్రో అనేది ఒక ప్రధాన ప్రయాణ మార్గంగా మారింది. కానీ దీనికి మాలినపు ఛార్జీలు ఇప్పుడు సామాన్యులకు భారమవుతున్నాయి.
ఇప్పటికే టికెట్ రేట్లు సామాన్యుల బడ్జెట్కు భారమవుతుండగా, తాజాగా మరో నిర్ణయం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికులు తీసుకెళ్లే లగేజ్పై ఛార్జ్ వసూలు చేయాలన్న నిర్ణయాన్ని మెట్రో అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రత్యేకంగా బరువు లేదా పరిమాణ పరంగా లగేజ్ ఉంటే అదనంగా డబ్బు చెల్లించాల్సి రావచ్చు.
ఈ నిర్ణయం అమలైతే రోజువారీగా పనుల కోసం ప్రయాణించే మధ్య తరగతి ప్రజలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మునుపటికన్నా ప్రయాణ ఖర్చు పెరిగి, మెట్రోను ఒక నమ్మకమైన ప్రయాణ మార్గంగా చూసేవారు మరల ప్రత్యామ్నాయాలను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్థికంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సామాన్యులకు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa