వినాయక చవితి అంటేనే కుటుంబమంతా కలసి జరుపుకునే ఒక పెద్ద ఉత్సవం — అందుకే అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.ఆగస్ట్ రెండో వారం మొదలైందంటే దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రుల జోష్ మొదలవుతుంది.ఈ సందర్భంగా విగ్రహ తయారీదారులు కొత్త రకమైన వినాయక విగ్రహాలను రూపొందించి భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ట్రెండ్కి తగ్గట్లుగా ప్రత్యేకమైన వినాయక విగ్రహాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.2025లో చోటుచేసుకున్న కొన్ని ముఖ్య సంఘటనలను ప్రతిబింబిస్తూ ప్రత్యేక విగ్రహాలు తయారు చేయడం విశేష ఆకర్షణగా మారింది. తాజాగా బెంగళూరు రూరల్ జిల్లా దేవనహళ్లి తాలూకా విజయపురం గ్రామానికి చెందిన రాజగోపాల్, ఆర్సీబీ జట్టు తొలి ఐపీఎల్ ట్రోఫీ విజయం జ్ఞాపకార్థం గణేశుడిని RCB కప్పుతో చేతిలో చూపిస్తూ విగ్రహాన్ని సృష్టించారు. ప్రస్తుతం ఈ విగ్రహ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అదే విధంగా ఆపరేషన్ సిందూర్ను ప్రతిబింబించే వినాయక విగ్రహాలు కూడా రూపొందిస్తున్నారు. సైనికుడి రూపంలో గణేశుని, ముందుగా మిలటరీ వాహనం, ఎస్-400 క్షిపణి ఏర్పాటుతో కూడిన విగ్రహాలు కనిపిస్తున్నాయి. భారత్ చేపట్టిన ఆ సైనిక చర్యను గుర్తుచేసేందుకు ఈ విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ధూల్పేట ప్రాంతంలో తయారైన విగ్రహాలు భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు పంపబడుతున్నాయి. ఈ సారి పర్యావరణ అనుకూలమైన మట్టి విగ్రహాలకు ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల వాటి విక్రయాలు మరింత పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa