భారత్పై సుంకాల పెంపు వెనుక ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావడమే తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య ఉద్దేశమని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రకటించింది. ఈ మేరకు వైట్హౌస్ ప్రెస్ సెక్రటనీ కరోలినా లెవిట్టీ వెల్లడించారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1న తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. మరో నాలుగు రోజుల్లోనే ఇంకో 25 శాతం పెంచారు.
మీడియా బ్రీఫింగ్లో లెవిట్టీ మాట్లాడుతూ.. భారత్పై సుంకాల పెంపు వెనుక రష్యాపై ఒత్తిడి తేవడమేనని అన్నారు.
‘ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అధ్యక్షుడు అన్నివైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు.. భారత్పై సుంకాలు పెంపు సహా ఇతర చర్యలు తీసుకుంటున్నది మనం చూస్తున్నాం.. ఎలాగైనా యుద్ధం ముగించాలనే కృతనిశ్చయంతో ఆయన (ట్రంప్) ఉన్నారు.. ఏదైనా సమావేశానికి ముందు నెల రోజులు పాటు వేచిచూడాలనే ఇతరుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటున్నారు’’ అని లెవిట్టీ పేర్కొన్నారు. వీలైనంత తర్వాత రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని ట్రంప్ కోరుకుంటున్నారని తెలిపారు.
కాగా, వైట్హౌస్లో ట్రంప్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ కలిశారు. యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్తో త్రైపాక్షిక చర్చలకు సిద్ధమేనని సంకేతం ఇచ్చారు. ఈ భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. తాను చాలా విజయవంతమైన రోజును గడిపానని పేర్కొనగా.. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడితో తాను జరిపిన ‘ఉత్తమ సంభాషణ’ ఇదేనని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
‘‘ వీలైనంత త్వరగా ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు.. వైట్హౌస్లో అధ్యక్షుడితో సమావేశమైన నాటో సెక్రెటరీ జనరల్ సహా ఐరోపా నాయకులు ఈ గొప్ప చర్యను అంగీకరించాయి.. ఇరువురు నేతలు (పుతిన్, జెలెన్స్కీ) కలిసి చర్చించుకోవడం గొప్ప విషయం.. అధ్యక్షుడు అలా జరుగుతుందని ఆశిస్తున్నారు.. మధ్యవర్తిత్వం వహిస్తూ రష్యా-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరిగేలా రెండింటితోనూ అమెరికా ప్రభుత్వం, ట్రంప్ యంత్రాంగం కలిసి పనిచేస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.’’
‘‘అలస్కాలో రష్యా అధినేత పుతిన్తో సమావేశమైన 48 గంటల అనంతరం వైట్ హౌస్లో ఐరోపా నాయకులను అధ్యక్షుడు కలిశారు. వాస్తవానికి పుతిన్తో భేటీ జరిగిన వెంటనే ఐరోపా నాయకులతో జరిగిన సమావేశంలో వారికి ఇచ్చిన రీడ్అవుట్లో చాలా పురోగతి ఉంది... గతంలో బైడైన్ యంత్రాంగం యుద్ధం ముగింపునకు ఇలాంటి ప్రయత్నం అస్సలు చేయలేదు’’ అని అన్నారు. అంతేకాదు, ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధమే వచ్చేది కాదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు లెవిట్టీ బదులిస్తూ.. ‘అది నిజమే.. ఈ నిజాన్ని మీరు అంగీకరిస్తారా? కానీ ఐరోపా నేతలు ఒప్పుకున్నారు.. పుతిన్ కూడా ఇదే చెప్పారు’ అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa