ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీసీ ఓడీఐ ర్యాంకింగ్స్‌ నుంచి రోహిత్, కోహ్లి పేర్లు తొలగింపు.. నెట్టింట ఫ్యాన్స్ గందరగోళం

sports |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 09:04 PM

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లు కనిపించలేదు. వారం కిందట విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ టాప్ 2లో ఉండగా, విరాట్ కోహ్లి టాప్ 4 ప్లేస్‌లో నిలిచాడు. అయితే, ఆగస్టు 20న విడుదల చేసిన తాజాగా ర్యాంకింగ్స్‌లో కనీసం టాప్ 100లో కూడా ఈ ఇద్దరి పేర్లు కనిపించలేదు. దాంతో రోకో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఒక ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటిస్తే ర్యాంకింగ్స్‌లో ఆ ప్లేయర్ నేమ్ కనిపించదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాంతో ఆ రెండు ఫార్మాట్లలో ఈ ఇద్దరి ఆటగాళ్ల పేర్లు తొలగించారు. అయితే, వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్, కోహ్లి పేర్లు ఐసీసీ లిస్ట్‌లో కనిపించకపోవడం గందగోళానికి గురి చేసింది.


సాంకేతిక లోపమా? లేక ర్యాంకింగ్ సిస్టమ్‌లో ఎక్కడైనా పోరపాటు జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూఏఈ వేదికగా ఫిబ్రవరిలో ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడారు. ఆ తర్వాత ఇప్పటి వరకు రోహిత్, కోహ్లి టీమిండియా తరఫున ఆడిందే లేదు. ఆస్ట్రేలియాతో అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్‌లోనే ఈ ఇద్దరూ కనిపించనున్నారు.


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు ఈ ఇద్దరూ టీమిండియా వన్డే జట్టులో ఆడతారని వారే స్పష్టం చేశారు. అయితే, బీసీసీఐ ఈ ఇద్దరితో సమావేశమవ్వాలని చూస్తోంది. దాని అర్థం వచ్చే వన్డే వరల్డ్‌కప్ లోపు రిటైర్మెంట్ తీసుకోవాలని సూచిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, విరాట్ కోహ్లి లండన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్ జర్నీ మొదలుపెట్టడంతో ఇప్పుడల్లా రిటైర్మెంట్ లేదని క్లారిటీ వచ్చింది.


కానీ తాజాగా ఐసీసీ చేసిన ఈ పనికి అందరిలోనూ టెన్షన్ మొదలైంది. అసలు ఇలా జరగడం వెనుక కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఐసీసీ కూడా దీని మీద ఇంత వరకు స్పందించలేదు. దాంతో రోహిత్, కోహ్లి ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్స్‌తో నెట్టింట హడావుడి చేస్తున్నారు. ఐసీసీ నిర్లక్ష్యమని కొందరు అంటుంటే, మరికొందరు సిస్టం లోపం అని భావిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa