ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియా కప్‌ షాక్: భారత్–పాక్ మ్యాచ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!

sports |  Suryaa Desk  | Published : Thu, Aug 21, 2025, 08:57 PM

ఆసియా కప్‌ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుందా? లేక బహిష్కరించబడుతుందా? అనే ప్రశ్నతో క్రికెట్ అభిమానులు గందరగోళానికి లోనయ్యారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో అన్ని రకాల క్రికెట్ సంబంధాలు తెంచేయాలన్న డిమాండ్ ఉధృతమైంది.కేవలం అభిమానులే కాకుండా, పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంలో గట్టిగా స్పందించారు. "దేశ భద్రతకి మించిన క్రికెట్ ఏదీ లేదు" అని కొందరు వ్యాఖ్యానించారు. దీంతో భారత్–పాక్ మ్యాచ్‌పై అనేక అనుమానాలు, ఊహాగానాలు చెలరేగాయి.అయితే, భారత్ ఆసియా కప్‌లో పాల్గొనాలా? పాక్‌తో తలపడాలా? అనే నిర్ణయం కేవలం ఆటగాళ్లకు గానీ, బీసీసీఐకి గానీ చెందదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. మల్టీ నేషనల్ ఈవెంట్ల విషయంలో ఆటను అడ్డుకోబోమని స్పష్టంగా తెలిపింది. ఫలితంగా, సెప్టెంబర్ 14న భారత్–పాక్ మ్యాచ్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవు. 2012-13లో చివరిసారిగా ఇరు జట్లు ద్వైపాక్షికంగా తలపడగా, ఆ తర్వాత ఆ సంబంధాలు నిలిచిపోయాయి. ఇకపై కూడా బోర్డర్ క్రాస్ సిరీస్‌లను అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, ఐసీసీ లేదా ఆసియా కప్ వంటి బహుళ దేశాల టోర్నీలలో మాత్రం భారత్ పాకిస్తాన్‌తో ఆడే అవకాశం ఉందని చెప్పింది.అంతేగాక, మల్టీ నేషనల్ ఈవెంట్ల నిర్వహణలో భారత్ కీలక పాత్ర పోషించాలని, పాక్ సహా అన్ని దేశాల అథ్లెట్లు పాల్గొనేలా వీసా ప్రక్రియను సులభతరం చేస్తామని మంత్రిత్వ శాఖ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa