ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా మరియు గోదావరి నదుల్లో పెరుగుతున్న వరద ప్రవాహాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య కార్యదర్శి (CS), డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో వరద పరిస్థితిపై చర్చించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమీక్షలో భాగంగా ఎరువుల లభ్యత, సరఫరా, అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్రమైన సమాచారం అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనులు ప్రభావితం కాకుండా చూసేందుకు అవసరమైన సన్నాహాలు చేయాలని సూచించారు.
ఇదే సందర్భంగా కాకినాడ సమీపంలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై కూడా సీఎం స్పందించారు. లంక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa