ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైను కూడా అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని ఆశపడ్డానన్న దియా కుమారి

national |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 06:19 AM

ఒకప్పుడు నైను  అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని బలంగా ఆకాంక్షించానని, అయితే విధి తనను రాజకీయ రంగం వైపు మళ్లించిందని రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా జైపూర్‌లోని చారిత్రక జంతర్ మంతర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.రాజస్థాన్ పర్యాటక శాఖ, స్పేస్ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన జంతర్ మంతర్‌లో దాదాపు 300 ఏళ్ల తర్వాత అక్కడి ప్రాచీన పరికరాలను ఉపయోగించి ప్రత్యక్షంగా ఖగోళాన్ని పరిశీలించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.ముఖ్య అతిథిగా హాజరైన దియా కుమారి మాట్లాడుతూ, "ఇది ఎంతో గర్వించదగ్గ క్షణం. మహారాజా సవాయ్ జైసింగ్ నిర్మించిన ఈ పరికరాల నుంచి చంద్రయాన్, గగన్‌యాన్ వరకు మన ప్రయాణం గొప్పది. ఇది మన ప్రాచీన ఖగోళ వారసత్వానికి, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తోంది" అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో సైన్స్, సంస్కృతి, చరిత్రలను మేళవించి ఈ వేడుకను నిర్వహించామని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇస్రో ఎగ్జిబిషన్‌ను ఆమె సందర్శించారు. వాటర్ రాకెట్రీ ప్రదర్శనలను, టెలిస్కోపుల ద్వారా అంతరిక్ష పరిశీలనను ఆసక్తిగా తిలకించారు. రాజస్థాన్‌ను ఆస్ట్రో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌కు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుని స్ఫూర్తినింపారు. స్పేస్ ఇండియా వ్యవస్థాపకుడు సచిన్ బంబా మాట్లాడుతూ, జంతర్ మంతర్ పరికరాలను ప్రత్యక్ష పరిశీలనకు ఉపయోగించడం ఇదే మొదటిసారని స్పష్టం చేశారు. కోటలు, ప్యాలెస్‌లకే కాకుండా, రాజస్థాన్ ఇప్పుడు విజ్ఞానం, శాస్త్రీయ దార్శనికతకు కూడా నిలయంగా నిలుస్తోందని దియా కుమారి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa