రాష్ట్రంలో ఎరువుల ధరలను కృత్రిమంగా పెంచి రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకూడదని, ఎరువుల బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఆదివారం నాడు రాష్ట్రంలో ఎరువుల లభ్యత, సరఫరా పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు వ్యవసాయ, విజిలెన్స్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలు, సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం, యూరియాను వ్యవసాయేతర పనులకు తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎరువులను పక్కదారి పట్టిస్తే, వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని తేల్చిచెప్పారు.క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలను ముమ్మరం చేసి, ఎప్పటికప్పుడు యూరియా నిల్వలను పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రైవేటు డీలర్లకు కేటాయింపులు తగ్గించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరాను గణనీయంగా పెంచాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa