ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భవతైన భార్యను చంపి.. రంపంతో ముక్కలు ముక్కలుగా చేసి

Crime |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 07:37 PM

హైదరాబాద్ కూకట్‌పల్లిలో క్రికెట్ బ్యాట్ కోసం ఏ 15 ఏళ్ల బాలుడు పదేళ్ల సహస్ర అనే అమ్మాయిని కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. బాలిక ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు.. బ్యాట్‌ను దొంగిలించే క్రమంలో అడ్డొచ్చిన సహస్రను వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. అత్యంత కిరాతకంగా 20 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఆ ఘటన మరవక ముందే నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గర్భవతమైన భార్యను ఓ భర్త కిరాతకంగా హతమార్చాడు. భార్యను చంపి శరీరారాన్ని ముక్కలు ముక్కలుగా రంపంతో కట్ చేశాడు. ఈ దారుణం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి రంపం మిషన్ సౌండ్ గమనించిన పొరుగింటి వాళ్లు.. అనుమానంతో చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరు బోడుప్పల్‌లో కాపురం ఉంటున్నారు. ప్రస్తుతం స్వాతి గర్భవతి. అయితే, మహేందర్ రెడ్డి తన భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. రంపంతో దారుణంగా శరీరాన్ని కట్ చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లలో ప్యాక్ చేసి బయట పడేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో గది నుంచి వింత శబ్దాలు రావడంతో పక్కింటి వారు అనుమానించి లోపలికి వెళ్లి చూశారు. దీంతో ఈ ఘోరం బయటపడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.


ఘటనా స్థలంలో కేవలం స్వాతి ఛాతీ భాగాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల, చేతులు, కాళ్లు, భుజాలు వంటి ఇతర శరీర భాగాలను నిందితుడు వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు తెలుస్తోంది. వాటిని కనుగొనడానికి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్వాతి, మహేందర్ గతంలో ఇదే ఇంట్లో పది నెలల పాటు అద్దెకు ఉన్నారని స్థానికులు తెలిపారు. తిరిగి 25 రోజుల క్రితమే మళ్లీ ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. కాగా, ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా అక్రమ సంబంధాలు వంటివి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించగా.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa