ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన సింగనమల ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 07:15 PM

అనంతపురం జిల్లాలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరంజనేయ స్వామిని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ పరిధిలోని ఎస్సీల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు, ఎస్సీ విద్యార్థుల వసతి గృహాలలో కొత్త భవనాలు, మౌలిక సదుపాయాల కోసం నిధులు ఇవ్వాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa