విజయవాడ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గణనాథుడి తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం వినాయకుడికి హారతి ఇచ్చి.. తీర్థం, ప్రసాదాలను స్వీకరించారు. వైసీపీ ఆఫీస్లో జరిగిన ఈ వినాయకుడి పూజలు.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీ కార్యాలయంలో నిర్వహించే గణపతి పూజలో పాల్గొనాలని ఆయన షెడ్యూల్లో లేనప్పటికీ.. పాల్గొనడం గమనార్హం. అయితే షెడ్యూల్ ప్రకారం.. వైఎస్ జగన్.. బుధవారం ఉదయం విజయవాడలోని రాణిగారితోట వద్ద నిర్వహించనున్న వినాయక పూజలో పాల్గొనాల్సి ఉండగా.. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే తాడేపల్లి ఆఫీసులోనే జరిగే గణపతి పూజలోనే పాల్గొనాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. ఇక ఈ వినాయకుడి పూజలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు.
మరోవైపు.. అంతకుముందు వినాయకచవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలిగి.. విజయాలు సిద్ధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షిస్తూ ఎక్స్లో ట్వీట్ పెట్టారు.
'రాష్ట్ర ప్రజలందరికీ ఆ ఆదిదేవుడు గణపతి ఆశీస్సులు ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రజలకు క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని కోరుకున్నారు. సకల శుభాలు కలగాలని.. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో చేపట్టిన మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలని తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని.. వినాయకుడి కరుణ, కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa