ఉత్తర భారతదేశంలో మానవ సంబంధాలు, భావోద్వేగాలు కొన్నిసార్లు సినిమాలకన్నా మించి ట్విస్ట్లకు తావిస్తుంటాయి. ఇటీవలి కాలంలో జరిగిన ఓ సంఘటన ఇందుకు నిజమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సంఘటనతో స్థానికులే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చలకు తావైంది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఓ యువకుడు తన భార్య చెల్లెలిని అంటే తన మరదలిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ సంచలనానికి కేంద్రబిందువయ్యాడు. తన కోరికను నెరవేర్చాలంటూ ఏకంగా టెలిఫోన్ టవర్ ఎక్కేశాడు. అలా టవర్పై దాదాపు ఏడు గంటల పాటు గడిపాడు.
పరిస్థితి అత్యంత ఉద్విగ్నంగా మారడంతో గ్రామస్థులు, పోలీసులు, స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. యువకుడిని కిందకు దిగేలా చేయడానికి పలుమార్లు ప్రయత్నించారు కానీ అతడు తానే పెట్టిన షరతులు నెరవేరకపోతే దిగబోనని తేల్చి చెప్పాడు. చివరకు అతనికి, మరదలితో పెళ్లి చేస్తామని హామీ ఇచ్చిన తర్వాతే అతడు కిందకు దిగాడు.
ఈ ఘటన విని ఆశ్చర్యపోయినవారు చాలా మందే. అయితే ఇది ఒక్క ప్రేమకథ కాదు, కుటుంబ వ్యవస్థపై ప్రశ్నలు వేస్తున్న సంఘటనగానూ మారింది. ఈ ఘటనలో యువకుడి మనస్తత్వం, కుటుంబ పరిస్థితులు, సామాజిక ఒత్తిళ్లపై విచారణ అవసరమని భావిస్తున్నారు. సమాజంలో సంబంధాల విలువను గుర్తెరుగుతూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa