ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 06:10 PM

ప్రతి మహిళ వ్యాపారవేత్తగా, పారిశ్రామిక వేత్తగా ఎదగడానికి ప్రభుత్వం అందిస్తున్న రక్షణ, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ సూచించారు. కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి అవగాహన సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల బాధ్యత కాదని, సమాజం మొత్తం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శక్తి యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు, అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళా రక్షణకు రాష్ట్రం కృషి చేస్తోందని తెలిపారు. వైజాగ్ దేశంలో అత్యంత భద్రమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గర్వకారణమని, ప్రతి ఊరిని బాలికలకు భద్ర ప్రదేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa