ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వం.. తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే ఉచిత ప్రయాణం కోసం మహిళలకు స్మార్ట్ కార్డులను తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద తీసుకువచ్చిన మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం.. సక్సెస్ఫుల్గా అమలు అవుతోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. 60 శాతం మహిళలు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని కొత్త బస్సులను.. ఆర్టీసీకి అప్పగిస్తామని తెలిపారు.
కొత్త బస్సులు.. 6 నెలల్లో అందుబాటులోకి వస్తాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు. ఆగస్ట్ 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చిందని.. అప్పటి నుంచి ఈ పథకానికి రూ.95 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. త్వరలోనే స్మార్ట్ కార్డులు అందిస్తామని పేర్కొన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు ఏసీ బస్సులను నడపాలి అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
కొట్టినట్లయిందనే వాదనలు వినిపిస్తున్నాయని.. మంత్రి మండిపల్లి తెలిపారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆటో డ్రైవర్ల కోసం కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈనెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టారు. మహిళలు, ట్రాన్స్జెండర్లు, బాలికలు ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును చూపించి.. బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. నాన్ స్టాప్, వేరే రాష్ట్రాలకు ప్రయాణించే బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణాన్ని అందించడం లేదు.
మరోవైపు.. విశాఖ శాంతిపురంలో జరిగిన ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదం ఘటనపై మంత్రి మండిపల్లి స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని.. డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి ప్రయాణికులను దించేసినట్లు తెలిపారు. వెంటనే ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని మండిపల్లి సమీక్షించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa