తిరుమలలో కోలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తిరుమల వెంకన్న దర్శనం కోసం తరలి వస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారి కోసం పెద్ద సంఖ్యలో సదుపాయాలు కల్పించినప్పటికీ.. కొన్ని సమయాల్లో వసతి లభించక భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. అయితే త్వరలోనే ఈ సమస్య కొంతమేర తీరబోతుంది అంటున్నారు. భక్తుల కోసం తిరుమలలో త్వరలోనే కొత్త భవనం అందుబాటులోకి రానుందని తెలిపారు. ఆ వివరాలు..
తిరుమలకు వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు గాను.. కొత్తగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనం త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. ఈక్రమంలో బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శనివారం నాడు.. తిరుమలలో నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని పరిశీలించారు. అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. యాత్రికుల వసతి సముదాయం 5 బిల్డింగ్ని అద్భుతంగా నిర్మించారు. ఇంజనీరింగ్ అధికారుల పని తీరు అద్భుతంగా ఉంది అని ప్రశంసించారు.
ఈ బిల్డింగ్ అందుబాటులోకి రావడం వల్ల.. తిరుమలలో వసతి సమస్య కొంత మేర తీరుతుందని బీఆర్ నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ వసతి సముదాయం భవనానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అనగా 2018లోనే అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం తిరుమలలో 45 వేల మందికి మాత్రమే వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నిర్మించిన పీఏసీ–5 వల్ల మరో 2,500 మంది యాత్రికులకు వసతి సౌకర్యం లభించనుంది. కనుక భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ నాయుడు కోరారు. ఈ సముదాయం వల్ల తిరుమలలో వసతి సమస్య కొంతవరకు తీరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భవన సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు. అలానే భవనంలోని హాల్స్, కళ్యాణ కట్ట, టాయిలెట్స్, అన్న ప్రసాద వితరణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. భక్తులకు అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa