ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, చైనాలపై ఆంక్షలు విధించండి.. ఐరోపా దేశాలకు అమెరికా డిమాండ్

international |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 05:06 PM

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి భారత్ ఆర్ధిక వనరులు అందజేస్తోందని ఆరోపిస్తూ అదనపు సుంకాలను విధించిన అమెరికా.. ఐరోపా దేశాలను కూడా అదేవిధంగా చేయాలని కోరినట్టు సమాచారం. భారత వస్తువులపై ట్రంప్ విధించిన 50 శాతం అదనపు టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చిన వచ్చిన విషయం తెలిసిందే. భారత్‌ను లక్ష్యంగా చేసుకోవాలని ఐరోపా దేశాలను అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌ కోరిందని అధికార వర్గాలు ఉటంకిస్తూ జాతీయ మీడియా పలు కథనాలు ప్రచురించింది.


రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను నిలిపివేయకపోతే అమెరికా మాదిరిగానే భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించాలని వైట్‌హౌస్ యంత్రాంగం కోరినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆంక్షల విధించడమే కాదు, భారత్ నుంచి ఆయిల్, గ్యాస్‌ కొనుగోళ్లను ఆపేయాలని కూడా కోరినట్లు వెల్లడించాయి. ఇటీవల అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు కొందరు ఐరోపా నాయకులు మద్దతు తెలిపిననట్టు సమాచారం. ఈ క్రమంలో భారత్‌ విషయంలో ట్రంప్ అవలంభిస్తోన్న విధానాలపై ఐరోపా దేశాలు మౌనంగా ఉన్నాయి. భారత్‌‌పై ట్రంప్ సుంకాలను అవి సమర్దించడం లేదా అలా అని తప్పుబట్టనూలేదు. ఈ క్రమంలో భారత్‌‌పై టార్గెట్ చేయాలని ట్రంప్‌ యంత్రాంగం కోరడం గమనార్హం.


అంతేకాదు, కొంతమంది ఐరోపా నాయకులు.. ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు బహిరంగంగా సమర్దిస్తూ లోపాయికారీగా చర్చలను విచ్ఛిన్నం ప్రయత్నిస్తున్నారని వైట్‌హౌస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ‘‘రష్యా నుంచి రాయితీల కోసం ఉక్రెయిన్‌ను ఒత్తిడి చేస్తున్న ఐరోపా నాయకుల పట్ల వైట్ హౌస్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు’’ అని ఓ అదికారి అన్నారు. కాగా, భారత్‌ను బెదిరింపులతో లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తోన్న ట్రంప్.. అదే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోన్న చైనా, ఐరోపా దేశాలపై మాత్రం ఎలాంటి సుంకాలు వేయకపోవడం గమనార్హం.


మరోవైపు, ఏడేళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశాధినేత షీ జిన్‌పింగ్‌‌తో ఆదివారం భేటీ అయ్యారు. అలాగే, రష్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం సమావేశమవుతారు. ఈ భేటీలో ట్రంప్ టారీఫ్‌ల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికా సుంకాల నేపథ్యంలో ఆ నష్టాన్ని పూడ్చుకోడానికి భారత్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే భారత వస్త్రాలను, టైక్స్‌టైల్స్‌ను యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతిచేసి.. అక్కడ మార్కెట్‌ను పెంచుకోవాలని నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa