సెప్టెంబర్ 1న ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసిన భూకంపం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో నమోదైన ఈ ప్రకృతి విపత్తు వేలాది కుటుంబాలపై కరాళనృత్యం చేసింది.1,400 మందికి పైగా మృతి… వేలాదిమంది గాయాలు.తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ (Zabihullah Mujahid) ప్రకారం, ఈ భూకంపంలో 1,411 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3,100 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో చాలామంది నిద్రలో ఉండగానే శిధిలాల కింద చిక్కుకుని మృతి చెందారని ఆయన తెలిపారు.గ్రామాలు శిధిలాలే… వేలాది ఇళ్లు ధ్వంసం భూకంపం ప్రభావంతో 5,400 కంటే ఎక్కువ ఇళ్లు నేలమట్టమయ్యాయి. మట్టి, కలపతో నిర్మితమైన ఇళ్లు తీవ్రతను తట్టుకోలేక పేకమేడల్లా కూలిపోయాయి. దీంతో అనేక గ్రామాలు పూర్తిగా శిధిలాలుగా మారగా, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.సహాయక చర్యలకు అవరోధాలే ప్రస్తుతం సహాయక బృందాలు ప్రాణాలను కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే పర్వత ప్రాంతాలు, దూర ప్రాంత గ్రామాలు రక్షణ చర్యలకు పెద్ద అడ్డంకిగా మారాయి. ఘటనాస్థలాలకు చేరుకోవడమే వారికి సవాలుగా మారిందిఐక్యరాజ్యసమితి ఆందోళన… సహాయం కోరుతున్న తాలిబన్ ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, సామాజిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆఫ్ఘనిస్తాన్కు అంతర్జాతీయ సమాజం వెంటనే సహాయం అందించాలని పిలుపునిచ్చారు.తాలిబన్ పాలనలో మూడో పెద్ద భూకంపం 2021లో తాలిబన్ అధికారం చేపట్టిన తర్వాత ఇది మూడవ అతిపెద్ద భూకంపం. అయితే మహిళల హక్కులపై ఆంక్షలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలు కారణంగా విదేశీ సహాయం తగ్గిపోవడం ఆఫ్ఘనిస్తాన్కు పెద్ద సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇతర సంక్షోభాల నడుమ ఆ దేశానికి మద్దతు చేరుకోవడం కష్టతరమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa