ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడి కత్తులతో దాడి చేసిన నలుగురు యువకులు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 01:58 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం ఓజుబంద గ్రామానికి చెందిన యువకులు వినాయక నిమజ్జనం ఊరేగింపులో వెళుతుండగా, రామన్నపాలెం జంక్షన్ వద్ద గోకవరం గ్రామానికి చెందిన యువకులు కోడి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గోకవరం గ్రామానికి చెందిన గేదెల శివ, రాయి అచ్చారావు, పోనసానపల్లి పవన్ కామేష్, మహిపాల దుర్గాప్రసాద్‌లను గుర్తించి, మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa