ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"పేదల కోసం ముందడుగు.. ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ సేవలు అందిస్తోంది"

national |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 11:43 PM

ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఫౌండేషన్, స్మైల్‌ ఫౌండేషన్‌ సహకారంతో పేద వర్గాల సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఇటీవల పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్‌ తెలంగాణలోని ఆదిలాబాద్‌, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో అమలైంది.ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన, ఆర్థిక అక్షరాస్యత శిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌ ఫౌండేషన్‌ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 9,700 మందికి పైగా ప్రత్యక్షంగా లబ్ధి చేకూరగా, మరో 26,000 మందికి పైగా పరోక్ష ప్రయోజనం కలిగింది.కార్యక్రమంలో భాగంగా వైద్య సంప్రదింపులు, వ్యాధులపై అవగాహన సెషన్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచిత మందుల పంపిణీతో కూడిన సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. కౌమారదశలో ఉన్న బాలికలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రక్తహీనత పరీక్షలు, రుతుక్రమ పరిశుభ్రతపై వర్క్‌షాప్‌లు, శానిటరీ ఉత్పత్తుల పంపిణీ చేపట్టారు. అదనంగా, టీనేజర్లకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ కార్పొరేట్‌ వ్యవహారాల వైస్‌ ప్రెసిడెంట్ సారా గిడియన్ మాట్లాడుతూ, “ప్రజలు సమగ్ర జ్ఞానం, అవసరమైన వనరులు పొందినప్పుడు మాత్రమే స్థిరమైన మార్పు సాధ్యమవుతుంది” అని అన్నారు. స్మైల్‌ ఫౌండేషన్‌ సహవ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ సంతను మిశ్రా మాట్లాడుతూ, “సమగ్ర అభివృద్ధి అనేది పేద వర్గాల పురోగతితోనే సాధ్యం అవుతుంది” అని అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa