ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాభికి ఏ నూనె రాస్తే ముఖం అందంగా మారుతుందో తెలుసా

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 11:25 PM

ముడతలు, మొటిమలు, నల్లటి వలయాలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు సౌందర్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. ప్రతి ఒక్కరూ తమ చర్మం ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా మొటిమలు, మచ్చల్లేని ముఖాన్ని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్లో దొరికే అనేక ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే సహజమైన పద్దతిలో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆయుర్వేదంలో ఇందుకోసం ప్రత్యేక పద్ధతి ఉంది. ఈ పద్ధతే నాభి చుట్టూ నూనె అప్లై చేయడం. ఈ విషయంపై న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ఇన్‌స్టాగ్రామ్ వీడియో షేర్ చేశారు. ఇందులో ఏ నూనె దేని కోసమో అప్లై చేయాలో చెప్పారు. అందులో ముఖ అందం కోసం కూడా ఉంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం.


నిపుణులు ఏమంటున్నారు?


ఆయుర్వేదంలో నాభి శరీరానికి కేంద్ర బిందువుగా పరిగణిస్తారు. నాభిలో సరైన నూనెను పూయడం వల్ల శరీరాన్ని లోపలి నుంచి పోషించడమే కాకుండా చర్మానికి మెరుపు ఇస్తుంది. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో నాభి శరీరంలోని ఒక భాగం మాత్రమే కాదు దాదాపు 72,000 శక్తి నరాలతో అనుసంధానించబడిన ఒక ప్రత్యేక మర్మ బిందువు అని ఆమె వివరించారు. సరైన నూనెను ఉపయోగించడం ద్వారా చర్మ సమస్యలను నయం చేయడమే కాకుండా.. మొత్తం శరీరాన్ని సమతుల్యం చేసుకోవచ్చు.


చర్మ సమస్యల కోసం ఏ నూనె వాడాలి?


మొటిమలు, మచ్చల సమస్యతో బాధపడుతుంటే వేప నూనె మంచి ఆప్షన్ అని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెప్పారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, డీటాక్సిఫైయింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నాభిలో వేప నూనె వేసి మసాజ్ చేస్తే మొటిమల సమస్య తగ్గుతుందని ఆమె చెప్పారు. అదే సమయంలో.. పొడి చర్మంతో బాధపడుతుంటే కొబ్బరి నూనె నాభి చుట్టూ అప్లై చేయడం మంచి ఆప్షన్ చెబుతున్నారు. నూనె చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారకుండా చేస్తుంది. సహజమైన మెరుపు కోసం బాదం నూనెను నాభిలో అప్లై చేయాలని చెప్పారు. బాదం నూనెలో విటమిన్ E ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా పోషిస్తుంది. ముఖం మెరిసేలా చేస్తుంది.


న్యూట్రిషనిస్ట్ ఏం చెప్పారంటే


ఇతర సమస్యలకు ఏ నూనె వాడాలంటే


* చర్మంతో పాటు న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా మరికొన్ని నూనెలు, వాటి ప్రయోజనాల గురించి వివరించారు.


* నాభిలో ఆముదం నూనెను వేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయని ఆమె వివరించారు.


* హార్మోన్ల అసమతుల్యత లేదా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటే, నువ్వుల నూనె ప్రయోజనకరంగా ఉంటుంది.


* నాభిలో ఆవ నూనెను అప్లై చేయడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు నుంచి ఉపశమనం లభిస్తుందని ఆమె వివరించారు.


ఉపయోగించే విధానం


* రాత్రి పడుకునే ముందు.. మీ అవసరాన్ని బట్టి నాభిలో 2-3 చుక్కల నూనె వేసి.. చేతులతో తేలికగా సర్క్యూలర్ షేపులో మసాజ్ చేయాలని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా చెప్పారు.


* ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేసేలా రాత్రంతా అలాగే ఉంచాలని చెప్పారు.


* ఆయుర్వేదంలో నాభిని శరీరానికి వైద్యం చేసే స్విచ్‌గా పరిగణిస్తారని శ్వేతా షా చెప్పారు. ఇక్కడ నూనె అప్లై చేయడం ద్వారా క్రమంగా మొత్తం శరీరంలోని నరాలకు పోషణను అందిస్తుంది. ఈ పద్ధతి చర్మ సమస్యలను నయం చేయడమే కాకుండా, శరీరాన్ని సమతుల్యం చేస్తుంది.


నాభిలో నూనె అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. నాభికి నూనె రాయడం వల్ల విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో చర్మం నాణ్యత మెరుగుపడుతుంది. ఆయుర్వేదంలో నాభి ఆరోగ్యం జీర్ణవ్యవస్థకు అనుసంధానించబడి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ చర్మానికి సహజమైన మెరుపును కూడా తెస్తుంది. ఆయుర్వేద దృక్కోణం నుంచి నాభిలో నూనె రాయడం వల్ల చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా, శరీరంలో సమతుల్యతను కాపాడుతుంది. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, బాదం నూనె లేదా నెయ్యిని క్రమం తప్పకుండా ఉపయోగించడం చర్మం ప్రకాశవంతంగా ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa